అక్కినేని ఫ్యామిలీలో ప్రేమ పెళ్లిల్లు అదరకొడుతున్నాయి అని అందరూ అనుకున్నారు. ఇంతలోనే అఖిల్ పెళ్లి క్యాన్సిల్ కావడం అక్కినేని అభిమానులను కలవరపెడుతుంది. అఖిల్ అన్న కంటే ముందు ఓ ఇంటివాడు అవుతాడనుకుంటే, పెళ్లి క్యాన్సిల్ వార్తతో టాలీవుడ్లో సెన్సేషన్ సృష్టించాడు. ముడేళ్లుగా ప్రేమించుకుని పెద్దల్ని ఒప్పించి ఘణంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నఅఖిల్, శ్రియా.. ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ చేసుకోవటం వెనుక అసలు నిజమెంత అనేవి ఇప్పుడు సోషల్మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్న అంశాలు.
ఇటలీలో గల రోమ్లో పెళ్లి ఫిక్స్ చేసుకుని.. ఎయిర్పోర్ట్లో జరిగిన గొడవ కారణంతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీ జనాలు ఫిల్మ్ ఇండస్ట్రీ జనాలు. ఎంగేజ్మెంట్ అయినప్పట్నుండి అఖిల్ తనతో ఎక్కువ మాట్లాడటంలేదని, తనతో సరదాగా ఉండటంలేదని శ్రేయ ఫీల్ అయ్యిందట. ఈ కారణం చేతనే జరిగిన గొడవ వీరు విడిపోటానికి దారితీసిందంటు ఫిల్మ్నగర్ టాక్. ఇదిలావుంటే గత వారం రోజులుగా ఈ పెళ్లి క్యాన్సిల్ వార్త సోషల్మీడియాను షేక్చేసి పారేస్తుంటే, ఇటు అక్కినేని వారుకాని, జి.వి.కె వారుకానీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం గమనార్హం.
అక్కినేని చైతూ కానీ, సమంత కానీ ఈ విషయంపై మౌనం పాటించటం ప్రేక్షకుల్లో కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అయితే ఈ విషయం పై నాగార్జున.. చాలా ఫీల్ అయ్యాడట. కొడుకుల ప్రేమను అంగీకరించి పెళ్లికి గ్రీన్సిగ్నల్ ఇచ్చిన నాగ్.. ఇప్పటి పరిస్థితి షాక్ అయ్యాడట. ఏదేమైనా వారు కలిసి ఏడు అడుగులు నడవాలనే తను ఆశపడుతున్నట్లు సన్నిహితుల దగ్గర చెబుతున్నట్లుగా సమాచారం. క్యాన్సిల్ అయ్యింది పెళ్లి డేట్ మాత్రమే కానీ, పెళ్లి కాదు అని , తన కొడుకు కోరుకున్న విధంగానే ఈ పెళ్లి జరగాలని అక్కినేని నాగార్జున తన సన్నిహితుల దగ్గర అంటున్నాడట.
{youtube}tr0datTn7AE{/youtube}
Related