Friday, May 3, 2024
- Advertisement -

చైతు, సమంత రిసెప్షన్ ఎందుకు ఆగింది..?

- Advertisement -

హీరో అక్కినేని నాగచైతన్య, సమంత.. ఇప్పుడు భార్యభర్తలుగా మారిపోయారు. కొన్నెళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరు.. ఈ నెల 6న కుటంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకున్నారు. అయితే.. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడంతో.. మరికొన్ని రోజుల్లోనే హైదరబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తారని అంతా భావించారు.

నాగ చైతన్య, సమంత ల పెళ్లికి అక్కినేని.. దగ్గుబాటి.. సమంత కుటుంబాల నుంచి సభ్యులతో పాటు.. సమంతకు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన చిన్మాయి.. రాహుల్ రవింద్రన్.. వెన్నెల కిషోర్ వంటి అతి కొద్ది మంది సభ్యులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. ఇప్పుడు రిస్పెషన్ సంగతికి వస్తే.. అక్కినేని ఫ్యామిలీకి రిసెప్షన్ ఇచ్చే ఉద్దేశ్యం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం రాజు గారి గది 2 సినిమా కోసం మామాకోడళ్లు అయిన నాగార్జున.. సమంతలు ఇద్దరూ తెగ ప్రచారం చేశారు. ఇలాంటి సమంలో రిసెప్షన్ ఎప్పుడనే ప్రశ్న ఎదురైంది.

తనకు చైతు.. సమంతలు ఎప్పుడు డేట్స్ ఇస్తే.. అప్పుడు రిసెప్షన్ నిర్వహిస్తానంటూ జోక్ చేస్తున్నారు నాగార్జున. అంతే కాదు.. తీరిగ్గా ఓ నెల రోజుల సమయం చూసుకుని అప్పుడు నిర్వహించవచ్చు కదా అంటున్నారు. పెళ్లి అయిన నెల నెలన్నర తర్వాత రిసెప్షన్ అంటేనే.. చాలా మందికి డౌట్ వచ్చేస్తోంది. అసలు వీరి రిసెప్షన్ చేసే ఉద్దేశ్యం అక్కినేని ఫ్యామిలీకి లేదని టాక్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -