భగవంత్ కేసరి తర్వాత నందమూరి బాలకృష్ణ 109ను కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీతో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ లో ఉంది.
రీసెంట్గా విడుదల చేసిన పోస్టర్ అందరిని ఆకట్టుకుంది. పోస్టర్లో ఓ గొడ్డలి, దానికి గ్లాసెస్ పెట్టారు. అందులో నుంచి కొన్ని రూపాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా పోస్టర్తోనే సినిమాపై అంచనాలను పెంచేశాడు బాబీ. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ఇండస్ట్రీలో వైరల్గా మారింది.
ఇప్పటికే బాలయ్య సరసన హీరోయిన్గా త్రిషను ఫైనల్ చేయగా మరో హీరోయిన్ను తీసుకోనున్నారట. అయితే మరో హీరోయిన్గా మీనాక్షి చౌదరిని తీసుకోనున్నారని తెలుస్తోన్న దీనిపై అఫిషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో సాగే ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు బాబీ. ఇప్పటికే అఖండ,వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో జోష్ మీదున్న బాలయ్య…మరోసారి హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.