Tuesday, May 14, 2024
- Advertisement -

జనతా గ్యారేజ్ స్టోరీ ఇదేనా?

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జనతా గ్యారేజ్. ఈ చిత్రం సెన్సార్ కి రేపు వెళుతుండగా స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో జోరుగా హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా రెండు గంటల నలభై మూడు నిమిషాల నిడివి ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇక స్టోరీ విషయానికి వస్తే…ఎన్టీఆర్ ఎంట్రీ లోనే ”ప్రణామం …….. ప్రణామం ” అంటూ సాగే పాటతో మొదలౌతుందట. ఇక ఎన్టీఆర్ తో పాటు సమంత, నిత్యా మీనన్, నిత్యా అన్నయ్య లు ముంబై లోని యునివర్సిటీ లో చదువుతుంటారు. వీళ్ళంతా కలిసి నేచర్ ట్రిప్ కి వెళతారు. మోహన్ లాల్ జనతా గ్యారేజ్ నడుపుతుంటాడు. అయితే ఈ గ్యారేజ్ పేరుకే కానీ లోపల మరో రహస్యం ఉంటుంది.

మోహన్ లాల్ కూతురే నిత్యా అన్న విషయం ఎన్టీఆర్ కు తెలుస్తుంది. నిత్యా అన్నయ్య ఎవరో చంపేస్తారు. నిత్యా మీనన్ అన్నయ్య ని ఎందుకు చంపారు ? ఎవరు చంపారు ? అసలు ఎన్టీఆర్ మోహన్ లాల్ కు ఉన్న సంబంధం ఏంటి ? చివరికి ఏం అయింది అనేది కథ. మరి ఈ కథనం నిజమేనా ? లేక ఎవరైనా కల్పించిందా అన్నది తెలియాలంటే జనతగ్యారేజ్ రిలీజ్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే.

Related

  1. జనతా గ్యారేజ్ రిలీజ్ ఎప్పుడో తెలుసా?
  2. జనతా గ్యారేజ్ లో సాంగ్స్ కాపీ కొట్టిన దేవిశ్రీ!
  3. జనతా గ్యారేజ్ ఆడియోకి సమంత ఎందుకు రాలేదంటే?
  4. జనతా గ్యారేజ్ లో రెండు క్లైమాక్స్ లు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -