యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జనతా గ్యారేజ్’. ఈ చిత్రంను మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తుండగా ఎన్టీఆర్ సరసన సమాంతా, నిత్యా మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రఖ్యాత మళయాళం నటుడు మోహన్ లాల్ ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.
సోమవారం తో షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసుకున్న జనతా గ్యారేజ్ ప్రపంచవ్యాప్తం గా సెప్టెంబర్ 1 న భారీ స్థాయి లో రిలీజ్ చేయనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో నే అత్యధిక థియేటర్ ల లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ.. చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ యూనిట్ తో పని చేయటం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
జనతా గ్యారేజ్ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది అన్న నమ్మకం ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో ఉన్న నటుడికి, అయన మాస్ ఇమేజ్ కి సరిపడే కథ ఇది. చాలా పెద్ద స్పాన్ ఉన్న ఒక హైలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఈ చిత్రం. సెప్టెంబర్ 1 న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మా నిర్మాతలు సిద్ధ పడుతున్నారు”, అని తెలిపారు.
Related