జనతా గ్యారేజ్ సూపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం ఏది చేయాలో తేల్చుకోలేక డైలమాలో పడ్డాడు . అందుకే వక్కంతం వంశీ తో చేస్తానన్న సినిమాని పక్కన పెట్టి పూరి జగన్నాద్ ని లైన్లో కి తీసుకొచ్చాడు . ఇక పూరి చెప్పిన లైన్ నచ్చడంతో స్క్రిప్ట్ వర్క్ చేయమని చెప్పాడట దాంతో పూరి బ్యాంకాక్ వెళ్లి ఆ పనిలో పడ్డాడు.
మొత్తానికి స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తికావడంతో వచ్చే నెలలోనే ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది . ఈలోపు ఇజం సినిమా కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి వచ్చే నెల లో పూరి సినిమా ఉండొచ్చు.
ఇజం హిట్ అయితే ఎలాగూ కాంబినేషన్ ఉంటుంది ఫ్లాప్ అయితేనే ఎన్టీఆర్ పునరాలోచన చేస్తాడేమో ! టెంపర్ తో ఎన్టీఆర్ కు హిట్ ఇచ్చాడు పూరి , పైగా నటుడిగా మరో మెట్టు ఎక్కేలా టెంపర్ చిత్రం చేసింది అందుకే పూరి తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఎన్టీఆర్.
Related