వరస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇటివలే జనతాగ్యారేజ్ తో సూపర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు తన తదుపరి సినిమాపై ఫోకస్ చేసాడు. ప్రస్తుతం అదుతున్న సమచారం మేరకు ఎన్టీఆర్ తన కొత్త సినిమాని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్, ఏఎన్నార్లాంటి గొప్ప నటులతో సినిమాలు తీసిన ఆయన మహేష్బాబు, అల్లు అర్జున్, నితిన్లాంటి నేటితరం హీరోలతో కూడా సినిమాలు తీసి సూపర్ హిట్స్ కొట్టారు. ప్రస్తుతం నాగార్జున తో ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాని తెరకెక్కిస్తున్న ఆయన.. తదుపరి సినిమా విజువల్ ఎఫెక్ట్స్కి ప్రాధాన్యమున్న ఓ స్టోరీని రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించినున్నట్లు తెలుస్తోంది. సోషియో ఫాంటసీ కథతో ఈ సినిమా రాబోతుందని అంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాకి దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ పెట్టబోతున్నట్లు సమచారం. ప్రతి హీరో కె.రాఘవేంద్రరావు లాంటి గొప్ప దర్శకుడితో సినిమా చేయాలి అనుకుంటారు. ఇప్పుడు ఆ చాన్స్ ఎన్టీఆర్ కి వచ్చేసరికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
Related