వెండితెరపై మరో సంచలన ప్రాజెక్టు త్వరలోనే ఆవిష్కృతం కానుంది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ నిర్మత బండ్ల గణేష్, అగ్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ ల కాంభినేషన్ మూవీ. ఈ క్రేజీ కాంభినేషన్పై ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే పూరీ-పవన్ ల కాంభినేషన్ లో వచ్చిన బద్రి సినిమా రికార్డుల మోత మోగించింది.
ఆ తర్వాత వీరిద్దరి కాంభోలో వచ్చిన కెమెరాబెన్ గంగతో రాంబాబు చిత్రం బాక్సాఫీసు వద్ద మిశ్రమ ఫలితాలను రాబట్టింది. అలాగే,పవన్ కళ్యాణ్తో కలిసి గబ్బర్ సింగ్ వంటి హిట్ సినిమాలు నిర్మించిన బండ్ల గణేష్ పవన్తో మళ్లీ మరో సినిమా తీయాలని చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు.
అలాగే, పూరీ జగన్నాథ్ సైతం లైగర్ మూవీ నిర్మాణంలో బిజీబిజీగా గడుపుతున్నారు. త్వరలోనే వీరిద్దరి ప్రాజెక్టులు పూర్తి కానున్నాయి. తర్వాతి ప్రాజెక్టుల గురించి పవన్, పూరీలు స్పష్టంగా వెల్లడించలేదు. కానీ వీరిద్దరినీ కలిపి.. బండ్ల గణేస్ ఓ సినిమా చేయడానికి రేడీ అవుతున్నారట. దీని ఈ విషయంలో పవన్ కూడా సానుకూలంగా ఉన్నారని టాక్. కాబట్టి వీలైనంత త్వరలోనే ఈ క్రేజీ కాంభినేషన్ గురించి అధికారికి ప్రకటన వచ్చే అవకాశముందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
సలార్లో 100 మంది కొత్త యాక్టర్లు