అప్ కమింగ్ చిరంజీవి- బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబోలో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే! ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్గా నటించేందుకు శృతిహాసన్ ఎంపికైనట్లు సమాచారం. చాలా మంది హీరోయిన్ల పేర్లను పరిశీలించిన తర్వాత డైరెక్టర్ బాబీ చివరిగా శృతిహాసన్ ను సెలక్ట్ చేశారని తెలుస్తోంది.
కమల్ హాసన్ కూతురుగా వెండి తెరకు పరిచయం అయిన శృతిహాసన్ కొంత సమయంలోనే తన యాక్టింగ్ తో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు సౌత్ లోని అన్ని ఇండస్ట్రీలో నటిస్తూ.. తన సత్తా చాటుతోంది. రెండేళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు.. మళ్లీ సినిమాల్లోకి వచ్చి క్రాక్ తో మంచి విజయం సొంతం చేసుకుంది.
దీంతో పాటు పవన్ కళ్యాణ్ తో కలిసి వకీల్ సాబ్ లోనూ నటిస్తోంది. వకీల్ సాబ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో పవన్ కు భార్యగా శృతి హాసన్ కనిపించనుందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు చిరుతో కొత్త సినిమాలో రొమాన్స్ చేయనుందని తెలుస్తోంది. ఇది పవర్ఫుల్ ఎమోషనల్ లో ఉండబోతుందని బాబీ చెబుతున్నాడు. మెగాస్టార్ కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాగా దీన్ని తీయబోతున్నాడని తెలుస్తోంది.
అభిమానుల ప్రేమకు పొంగిపోతున్న నిధి అగర్వాల్
రామ్ చరణ్, శంకర్ సినిమా కథ ఎలా ఉండబోతుందంటే..?