విజయశాంతి… ఒక్కప్పటి టాప్ హీరోయిన్ అయిన ఈమె ‘ఒసేయ్ రాములమ్మ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోల హవ కొనసాగుతున్న టైంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు తీసి అందరి చేత ఔరా అనిపించుకుంది విజయశాంతి.
అప్పట్లో.. చిరు, బాలకృష్ణ వంటి టాప్ హీరోలకొ ధీటుగా అత్యధిక పారితోషికం తీసుకున్న ఆమె పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చి తల్లి తెలంగాణ అన్న పొలిటికల్ పార్టీ కూడా స్థాపించారు. ఆ తర్వాత ఆ పార్టీని తెరాసలోకి విలీనం చేశారు, 2009లో తెరాస తరుపున మెదక్ ఎంపీగా గెలుపొందిన విజయశాంతి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో వున్నారు. తాజాగా ఆమె ఒక ప్రైవేట్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పారు. నాకు చాలా సింపుల్ గా ఉండటం అంటే ఇష్టం.
అందుకే నా పెళ్లి కూడా శ్రీనివాస్ ప్రసాద్ తో చాలా సిపుల్ గా చేసుకున్నాను. దాదాపుగా రాజకీయాలో తప్ప మిగిత టైంలో కనిపించను. నిన్న… నేడు రోజుల్లో వారసులు సరిగ్గ చూస్తారన్న ఆశ, నమ్మకం అయితే నాకు లేదు. అందుకే నేను పిల్లలను కనలనుకోలేదు. ప్రజలనే నేను నా పిల్లలు అనుకున్నాను. నా జీవితం అంత ప్రజలకే అంకితం చేశాను.. వాళ్లకోసమే బ్రతుకుతాను… వాళ్లకోసంమే చచ్చిపోతాను. ఇక రాజకీయాలు మురికి కాల్వలంటీవి. అయిన తప్పని పరస్థితులో రాజకీయాలోకి వచ్చానని విజయశాంతి చెప్పుకొచ్చారు.
Related