జనతా గ్యారేజ్ మూవీ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న మరో సినిమా ‘జై లవ కుశ’. బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమచారం ప్రకారం ఈ సినిమాలో సమంత ఓ లేడీ విలన్ గెటప్లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే, సమంత కెరీర్లో ఆమె విలన్ పాత్ర పోషించిన చిత్రం ఇదే మొదటిది అవుతుంది.
జనతా గ్యారేజ్, రామయ్య వస్తావయ్య, రభస, బృందావనం వంటి చిత్రాల తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న ఐదవ చిత్రం ఇది. బాబీ డైరెక్ట్ చేస్తున్న జై లవ కుశ సినిమాలో సమంత, తారక్తో డీకొట్టే లేడీ విలన్ పాత్రలో కనిపించనుందని సినీవర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ విషయంపై మూవీ యూనిట్ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆగస్టులో రిలీజ్ కానున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, నివేదా థామస్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Related