సత్యదేవ్ అనగానే అందరికీ ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా గుర్తొస్తుంది. ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న సత్యదేవ్ త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.అభిషేక్ శర్మ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రామ్సేతు’ లో సత్యదేవ్కు అవకాశం వచ్చినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీ సమాచారం.
జాక్వెలిన్ ఫెర్నాండేజ్, సుష్రత్ భారుష హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలు అక్షయ్ కుమార్ ఒక పురావస్తు శాస్త్రవేత్త పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను కేవలం బాలీవుడ్లో మాత్రమే కాకుండా దక్షిణాది భాషలలో కూడా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి సీనియర్ నటుడు నాజర్, తెలుగు ఇండస్ట్రీ నుంచి సత్యదేవ్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి సమాచారం త్వరలోనే చిత్రబృందం తెలియజేయనుంది.
Also read:సినిమా ప్లాప్ అయ్యింది.. మొత్తం డబ్బు మహేష్ బాబు వెనక్కి ఇచ్చి నన్ను కాపాడాడు: నిర్మాత అభిషేక్ నామా!
అన్ని భాషలలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అమెజాన్, లైకా సంస్థలతో కలిసి విక్రమ్ మల్హోత్రా, అరుణ భాటియా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలోనే ఈ చిత్ర షూటింగ్ ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో ప్రారంభమయింది. అయితే కరోనా కారణం వల్ల షూటింగ్ వాయిదా పడిన ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.
Also read:అమ్మ నాన్న బ్రేకప్ పై శృతి హాసన్ రియాక్షన్.. విడిపోవడమే కరెక్ట్ అంటూ?