సినిమా ఇండస్ట్రీలో సినిమా తీయాలంటే ఎన్నో కష్టాలు భరించాల్సి. అన్ని కష్టాలను దాటుకొని సినిమా తీయడం ఒక ఎత్తయితే ఆ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడం మరో ఎత్తు. డిస్ట్రిబ్యూషన్ విషయంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా సినిమా కోసం పడిన శ్రమ మొత్తం వృధా అవుతుంది. ఈ విధంగా ఎంతో మంది నష్టపోయిన వారు ఉన్నారు, లాభం పొందిన వారు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరికిగా పేరు సంపాదించిన వారు అభిషేక్ నామా.
అభిషేక్ నామ ఎన్నో చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్ గా పని చేశాడు.కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ హాలీవుడ్ వంటి చిత్రాలకు సైతం డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. ఈ క్రమంలోనే నైజాం ఏరియాకు సంబంధించి.. వరుడు, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘అత్తారింటి దారేది’, ‘హార్ట్ ఎటాక్’, ‘మనం’, కుమారి 21 ఎఫ్’, లోఫర్, రుద్రమదేవి, బ్రహ్మోత్సవం ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాలకు కూడా డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు.
Also read:ఆ ఫొటో చిరునవ్వులు తెప్పించింది: నమ్రత
అభిషేక్ నామ దాదాపు అందరూ హీరోలు, నిర్మాతలతో పనిచేయడంతో సినిమా లాభనష్టాలు హీరో భాగస్వామ్యం విషయంపై ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మాట్లాడుతూ… మహేష్ బాబు నటించిన సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్ కి లేదా నిర్మాతలకు నష్టాలు వస్తున్నాయి అంటే మహేష్ బాబు మాత్రం వారిని పిలిచి డబ్బును తిరిగి వెనక్కి ఇచ్చేవారని చెప్పుకొచ్చారు.కొందరు హీరోలు లేదా నిర్మాతలు తర్వాత సినిమాకి డిస్ట్రిబ్యూటర్ గా తీసుకోమని చెప్తారు.కానీ మహేష్ బాబు మాత్రం తర్వాత సినిమా అతనితో చేసినా చేయకపోయినా డబ్బులను తిరిగి రిటర్న్ చేసేవారని అది తన గొప్ప వ్యక్తిత్వం అని అభిషేక్ నామా ప్రిన్స్ మహేష్ బాబు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.