మెగాస్టార్ చిరంజీవి జోరు పెంచాడు. వరుస ప్రజెక్టులకు ఒకే చెబుతూ.. దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ను వీలైనంత త్వరగా పూర్తిచేసే పనిలో ఉన్నాడు చిరు. ఇప్పటికె ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ సగానికి పైగా పూర్తయిందని సమాచారం. ఇది పూర్తయిన వెంటనే మలయాళం బ్లక్ బస్టర్ మూవీ ‘లూసిఫర్’ రీమేక్ లో నటించనున్నారు.
చిరు కథానాయకుడిగా వస్తున్న లూసిఫర్ రీమేక్ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఏప్రిల్ లో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించనున్నట్టు సమాచారం. ఈ చిత్రంతో పాటు ‘వేదాళం’ రీమేక్ చేయనున్నాడు చిరు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది.
ఈ రెండు సినిమాలతో పాటు ప్రముఖ దర్శకుడు బాబీ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ సోనాక్షి సిన్హా నటించబోతున్నదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయమై ఇప్పటికే దర్శకనిర్మాతలు సోనాక్షిని సంప్రదించారట. బాలయ్య మూవీలోనూ సోనాక్షి నటించనుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఏపీ మంత్రులకు హైకోర్టు నోటీసులు
రెండు డోసులు తీసుకున్న నర్సుకు కరోనా
ఏపీకి ప్రత్యేక హోద ఇవ్వలేం: కేంద్రం