Friday, April 19, 2024
- Advertisement -

మహేష్ బాబుతో నిధి అగర్వాల్ రొమాన్స్.. ఏ సినిమా కోసమంటే?

- Advertisement -

టాలీవుడ్ హిట్ కాంబినేషన్ ప్రిన్స్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మరో సినిమా వస్తున్నట్లు ఇటీవలే తాజాగా వదిలిన ప్రోమో వీడియోతో అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీనీ “ఎస్ఎస్ఎమ్‌బీ28” అనే వర్కింగ్ టైటిల్‌తో ముందుకు తీసుకెళ్తున్నారు.త్రివిక్రమ్,మహేష్ కాంబినేషన్లో ఇప్పటికే అతడు, ఖలేజా వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. తాజాగా ఈ మూవీతో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమయ్యారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది
ఈ సినిమాలో ప్రిన్స్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇప్పటికే మెయిన్ హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఫైనల్ చేసిన విషయం తెలిసిందే తాజాగా సెకండ్ హీరోయిన్ కోసం ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగ‌ర్వాల్‌‌ని ఫైనల్ చేశారని సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇక సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని, వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా సినిమా విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Also read:పూజ హెగ్డేకు ఫిదా అయినా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..?

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగ‌ర్వాల్‌‌ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన “హరి హర వీరమల్లు” అనే పిరియాడిక్ కథాంశంతో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు పలు తమిళ ,కన్నడ సినిమాల్లో కూడా నటిస్తోంది.

Also read:వైరల్ గా కీర్తి సురేష్ వీడియో.. అవగాహనా కల్పిస్తున్న మహానటి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -