బిగ్ బాస్ నాల్గవ వారం అయిపోయిన తర్వాత వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది స్వాతి దీక్షిత్. అతి తక్కువ సమయంలోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. స్వాతి ఎలిమినేషన్ అయిందన్నప్పుడు అందరు షాక్ అయ్యారు. ఇంకోవైపు ఏమైనా సీక్రెట్ టాస్క్ అయ్యి ఉంటుందని అనుకున్నారు. కానీ అవన్నీ ఏమీ లేవు. స్వాతి నిజంగానే ఎలిమినేట్ అయింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఎలిమినేషన్ పై తాను కూడా షాక్ అయినట్లు స్వాతి చెప్పుకొచ్చింది. ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నాకు సాధ్యం అయినంత వరకు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు ట్రై చేశాను. నేను చేసిన దాంట్లో కేవలం 5 శాతం మాత్రమే చూపించడం వల్ల నా గురించి ప్రేక్షకులకు ఎలా తెలుస్తుంది. అందుకే ప్రేక్షకులు నాకు ఓట్లు వేయలేదని నేను అనుకుంటున్నాను. నేను ఎలిమినేషన్ అయిన తర్వాత హౌస్ లో గేమ్ ఆడుతూ ఎంటర్ టైన్ చేసేవారికి మాత్రమే ప్రేక్షకుల సపోర్ట్ ఉందని నాగార్జున గారు అన్నారు.
ఆయన మాటలు నాకు ఆశ్చర్యంగా అనిపించింది. నేను ఎంటర్ టైన్ చేయలేదని ఎలా అంటారు. డాన్స్ చేశాను.. నవరసాల టాస్క్ లోనూ మరియు కాయిన్స్ టాస్క్ లోనూ నేను సాధ్యం అయినంత వరకు కష్టపడ్డాను. దెబ్బలు తగిలించుకుని బొటలు వేలు ప్యాశ్చర్ అయినా కూడా పట్టించుకోకుండా గేమ్ ఆడాను. అలాంటిది నేను గేమ్ ఆడలేదని అనడం బాధగా అనిపించింది. ఆ మాటలు నాగార్జున గారు ఏ ఉద్దేశ్యంతో అన్నారు అర్దం కాలేదని స్వాతి దీక్షిత్ అన్నారు.
అల్లు అర్జున్ కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా ?
పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?
స్కైప్కి పిలిచి.. డ్రెస్ విప్పమన్నాడు.. పోస్ట్ చేసిన సింగర్ చిన్మాయి