మురుగదాస్ డైరెక్షన్ లో మహేష్ బాబు చేసిన సినిమా స్పైడర్. అయితే ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాపై కావాలనే నెగిటీవ్ టాక్ స్పెడ్ అయ్యిందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్పైడర్ విడుదలకు ముందురోజు సాక్షిలో వైసీపీ ఎమ్మెల్యే రోజామహేష్ ఇంటర్వ్యూ చేసింది.
ఆ ఇటర్వూలో భాగంగా వైఎస్ గురించి జగన్ల గురించి గొప్పగా చెప్పడంతో.. మహేష్ బావ మా పార్టీ ఎంపీ అయితే.. మహేష్ జగన్కు జై కొట్టడమేంటని టీడీపీ నేతలు స్పైడర్ మూవీపై విషప్రచారం మొదలు పెట్టారని.. అంతే కాకుండా ఆ పార్టీకి సంబంధించిన ఇంటర్నెట్ వింగ్ ఈ వ్యవహారం మొత్తాన్ని నడిపించిందని మహేశ్ బాబు ఫ్యాన్స్ వారిపై కోపంగా ఉన్నారు. అసలు థియేటర్లలో బొమ్మ పడకుండానే.. సినిమా ప్లాప్ అని డిజాస్టర్ అంటూ కామెంట్స్ పెట్టి.. ఫేస్బుక్, ట్విట్టర్లో ప్రచారం నడిపించారని దీనిపై మహేశ్ ఫ్యాన్స్ కూడా గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. అంతే కాకుండా.. వైసీపీ ఎమ్మెల్యే రోజాది ఐరన్ లెగ్ అని మహేష్ సినినా పోతుందని ముందే తెలుసని కామెంట్స్ పెడుతున్నారు.
అంతే కాకుండా నంద్యాల ఉప ఎన్నికల్లో బావ పార్టీకి కాకుండా వైసీపీకి మహేష్ ఫ్యాన్స్ జై కొట్టడం, వారి తరపున ప్రచారం చేయడం.. ఆది శేషగిరి రావు స్వయంగా మహేశ్ ఫ్యాన్స్ మద్దతు వైసీపీకే అని చెప్పడంతో పచ్చ పార్టీ బ్యాచ్ జీర్ణించుకోలేక.. స్పైడర్ పై ఈ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారని.. సినిమా మరీ అంత ధారుణంగా ఏం లేదని పచ్చ బ్యాచ్ చేసిన నెగిటివ్ ప్రచారం ప్రేక్షకుల్లో బలంగా వెళ్ళడంతో.. ఆ ప్రభావం స్పైడర్ చిత్రం పై పడిందని.. ఏది ఏమైన రాష్ట్రాన్ని చెత్త పాలిటిక్స్తో నడుపుతున్న పచ్చ నేతలు.. ఇప్పుడు సినీ పరిశ్రమనూ భ్రష్టు పట్టిస్తున్నారని చర్చించుకుంటున్నారు.