మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ.. స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా తీయబోతున్న విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్టు ఇప్పటికే అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ శంకర్కు ప్రస్తుతం ఇండియన్ 2 నిర్మాతలతో వివాదం నడుస్తోంది. తాజాగా ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. దీంతో చెర్రీ సినిమాకు లైన్ క్లియర్ అయ్యింది. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఈ మూవీని స్టార్ట్ చేసే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్కు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం బయటకు వచ్చింది. అదేమింటే చరణ్ ఆర్ఎస్15కు థమన్ స్వరాలు సమకూర్చబోతున్నాడట. ప్రస్తుతం థమన్ టాలీవుడ్లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా దూసుకుపోతున్నాడు. దీంతో శంకర్ -చెర్రీ సినిమాకు అతడికి అవకాశం ఇచ్చినట్టు సమాచారం. ఇక ప్రస్తుతం చరణ్.. ఆచార్య మేకింగ్ పనుల్లో బిజిగా ఉన్నాడు. ఈ మూవీలో ఓ కీలకపాత్రలో కూడా నటిస్తున్నాడు.
Also Read:గురూజీ ఫోకస్ మొత్తం పవన్ సినిమా పైనే..!
మరోవైపు ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా తుది దశకు చేరుకున్నది. ఈ రెండు చిత్రాల షూటింగ్ పూర్తయ్యాక.. పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలో నటించబోతున్నాడు చరణ్. అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరు అన్నది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.
Also Read: హీరోగా దేవిశ్రీ ప్రసాద్ అరంగేట్రం..!