Wednesday, May 15, 2024
- Advertisement -

ఫిలిం ఫెస్ట్ @ ఆగ‌స్ట్ ,సెప్టంబ‌ర్

- Advertisement -

సమ్మర్లో ఫిలిం ఫెస్ట్ ను చూద్దామనుకున్నవారికి ఆ ఛాన్స్ దక్కలేదు.కరెక్ట్ టైమ్ కు వస్తుందనుకున్న ఏ చిత్రం ఇన్ టైమ్ కు రాకుండా పోయింది.దీంతో ఫిలిం ఫెస్ట్ కు ఆగస్ట్ ,సెప్టంబర్లు వేదికవుతున్నాయి.

సమ్మర్లో మిస్ అయిన ఫిలిం ఫెస్ట్ కు రానున్న రెండు నెలలు వేదిక కాబోతోంది.ఆగస్ట్ ,సెప్టెంబర్ నెలల్లో  టాలీవుడ్లో ఫిలిం ఫెస్ట్ జరగబోతోంది.ఈ ఫిలిం ఫెస్ట్ కు టాలీవుడ్లో ప్రెస్టీజియస్ ఫిలింస్ గా చెపుకుంటోన్న ఓ మూడు చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ముందుగా బోణి కొట్టడానికి శ్రీమంతుడు మహేష్ బాబు రాబోతున్నాడు.ప్రిన్స్ అంటే మార్కెట్లో ఉన్న క్రేజ్ కు ఈసినిమా కరెక్ట్ గా సెట్ అవ్వబోతోంది.

శ్రీమంతుడు ఇచ్చే ఎఫెక్ట్ ఎలా ఉన్నప్పటికీ… రవితేజ,సురేందర్ రెడ్డిలు మరోసారి డబుల్ కిక్ ఇవ్వడానికి మన ముందుకు ఆగస్ట్ మంత్ నే….. ఫైనలైజ్  చేసుకున్నారు.ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసుకుంటూ వచ్చిన కిక్ 2…. ఈసారి కచ్చితంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి తీరుతుందని…. బల్లగుద్ది మరీ చెబుతున్నారు.కిక్ వచ్చిన తర్వాత వచ్చే మరో ప్రెస్టీజియస్ వెంచర్ …రుద్రమదేవి. ఈసినిమా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే చిత్రమవుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.అయితే రుద్రమదేవి కూడా అనేకసార్లు వాయిదా వేసుకోవడంతో ….ఈసినిమాకొచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందా ఆందోళనలో కొందరున్నారు. 

కాని ఇప్పటికీ ఈ సినిమా విషయంలో యూనిట్ ఎంతో నమ్మకంతో ఉంది.ఈసినిమాతో హిట్ ఎలాగైనా కొట్టి తీరుతామని చెబుతున్నారు.అందుకే సెప్టెంబర్ 4కు ముహూర్తం షురూ చేశారు. టాలీవుడ్లో జరగబోతోన్న ఈ ఫిలిం ఫెస్ట్ కు ఈ మూడు భారీ చిత్రాలు వస్తున్నప్పటికీ..ఆతర్వాత వచ్చే చిన్న చిత్రాలకు కూడా మాంచి డిమాండ్ ఏర్పడింది.శివంతో రామ్ ,సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తో సాయిధరమ్ తేజ్ లు ఇదే సీజన్లో వస్తూ ఫిలిం ఫెస్ట్ కు ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నారు.

ఫిలిం ఫెస్ట్ కోసం ఇంతమంది గుంపులా వచ్చిపడిపోతున్నారు గాని…. వీరిలో ఎంతమంది సాలిడ్ హిట్ లను  కొడతారనేది ఇంకా తెలియకుండా ఉంది. ఎందుకంటే ఇలా వస్తోన్న ప్రతి చిత్రంపై మార్కెట్లో ఏదో ఒకమైన నెగిటివ్ టాక్ ఉండనే ఉంది. మరి వీటిలో ఏది ఆ నెగిటవ్ టాక్ ను బ్రేక్ చేసి సక్సెస్ ను మూట గట్టుకుంటుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -