ఆర్ఆర్ఆర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శకధీరుడు రాజమౌళి సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బాహుబలికి స్టోరి అందించిన విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సినిమా తర్వాత మహేష్ – మహేష్ సినిమా పట్టాలెక్కనుంది. ఇందుకు సంబంధించి అనౌన్స్మెంట్ త్వరలో రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర గాసిప్ టీ టౌన్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కించనున్నారట. బాహుబలి సినిమాలో ఉన్న ట్విస్ట్ మాదిరిగానే ఈ సినిమాలోనే బిగ్ ట్విస్ట్ ఉండనుందట. ప్రస్తుతం సినిమా కథకు సంబంధించి స్క్రిప్ట్ రైటింగ్ ప్రాసెస్లో ఉందని టాక్.
కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తుండగా ఇంగ్లీష్ నావల్ బేస్గా ఈ కథ ఉండనుందట. సినిమా విజువల్ పరంగా మరోసారి ప్రేక్షకులకు కనువిందు కలిగేలా ఉండనుందట. ఇందుకోసం హాలీవుడ్ స్టూడియో మేకర్స్తో సంప్రదింపులు జరుపుతున్నారట. పాన్ ఇండియా లెవల్లోనే కాదు వివిధ దేశాల్లోని భాషల్లో కూడా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. మొత్తంగా విడుదలకు ముందు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.