సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా విజయం సాధించింది అంటే చాలు ఇక ఆ సినిమాకు కొనసాగింపుగా మరో సినిమా తెరకెక్కుతుంది. ప్రేక్షకులు సైతం ఈ విధమైన సినిమాలపై ఎంతో ఆసక్తి చూపెడతారు.ఈ విధంగా సూపర్ హిట్ చిత్రాలకు కొనసాగింపుగా తీసే చిత్రాలనే సీక్వెల్ చిత్రాలు అని చెప్తారు. ప్రస్తుతం మన టాలీవుడ్ ఇండస్ట్రీలో సీక్వెల్ చిత్రాల హవా కొనసాగుతోంది.
ప్రస్తుతం మన తెలుగు ఇండస్ట్రీలో దాదాపు అరడజను పైగా సీక్వెల్ చిత్రాలతో దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ఇక తాజాగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్పా సినిమా సీక్వెల్ అని చెప్పడంతో తెలుగు ప్రేక్షకుల దృష్టి మొత్తం ఈ సినిమా పైనే పడింది. ప్రస్తుతం తెలుగు లో ఉన్నటువంటి సీక్వెల్ చిత్రాలు ఏమిటో తెలుసుకుందాం..
Also read:బాలకృష్ణ తన కెరియర్లో వదులుకున్న సినిమాలివే?
1993లో శివనాగేశ్వర్రావు దర్శకత్వంలో వచ్చిన ‘మనీ’ సినిమాకు సీక్వెల్ గా ‘మనీ మనీ’. ఆ తర్వాత గాయం, రక్త చరిత్ర, శంకర్ దాదా ఎంబిబిఎస్, బాహుబలి, గబ్బర్ సింగ్ వంటి ఎన్నో చిత్రాలు సీక్వెల్ గా తెరకెక్కాయి. తాజాగా అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా సీక్వెల్ ఉంటుందనే సమాచారం వినబడుతుంది. అదేవిధంగా ఎఫ్2 సీక్వెల్ గా ఎఫ్ 3 తెరకెక్కుతుంది. మంచు విష్ణు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఢీ’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్గా ‘ఢీ అండ్ ఢీ’ని తీసుకొస్తున్నారు.
Also read:పిల్లల్ని హత్తుకొని ఎమోషనల్ అయిన అల్లు అర్జున్..ఎందుకంటే?
నిఖిల్ నటించిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్ చిత్రంగా కార్తికేయ 2, విశ్వక్ సేన్ హిట్, అడవి శేషు గూడచారి, సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ బంగార్రాజు, వంటి చిత్రాలు సీక్వెల్ చిత్రాలుగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి.