బుల్లితెరపై తన అందాలతో కుర్రకారుకు పిచ్చేక్కించిన భామ రష్మీ. వెండితెరపై ఈ భామ అదే రెంజ్ లో రెచ్చిపోయింది. గుంటూరు టాకీస్ చిత్రంలో రష్మీ అందాలకు వెండితెర మీద కూడా ఆమెకు మంచి హాట్ ఇమేజ్ వచ్చింది. ఇదిలా ఉంటే రోజు రోజుకు అటు బుల్లితెర మీద, ఇటు వెండితెర మీద రెచ్చిపోయి స్కిన్ షో చేస్తోన్న రష్మీకి ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడిందట. రష్మీకి ఇటీవల ఆకతాయిల నుంచి వేధింపుల ఫోన్ కాల్స్ ఎక్కువుగా వస్తున్నాయట.
ఎవరో తెలియని వాళ్ళు తనకు ఊరికే కాల్స్ చేసి విసిగిస్తున్నట్టు ఆమె వాపోతుంది. షూటింగ్స్లో బిజీగా ఉంటున్నప్పుడు కూడా ఆమెకు కంటిన్యూగా వేస్ట్ ఫోన్ కాల్స్ వస్తుండడంతో ఈ హాట్ భామకు ఏం చేయాలో తెలియడం లేదట. ఫోన్ నెంబర్ మార్చేద్దామంటే ఆ నెంబరే టాలీవుడ్లో తన సర్కిల్స్తో పాటు అందరు నిర్మాతల వద్ద ఉందట. కొత్త నెంబర్ అయితే కాంటాక్ట్స్కు మళ్లీ ఇబ్బంది వస్తుందనే ఆమె ఆ నెంబర్నే కంటిన్యూ చేస్తోంది.
అయితే రోజుకు 50 వరకు తెలియని ఫోన్ కాల్స్ వస్తుండడంతో ఆమె వారి వేధింపులు తట్టుకోలేకపోతుందట. అయితే రష్మీ వ్యాఖ్యలపై టాలీవుడ్లో మరో టాక్ వస్తోంది. ఆమె ఛాన్సుల కోసం ప్రి పబ్లిసిటీ చేసుకుంటోందని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. రష్మీకి సినిమాలు వెండితెరపై వరుసగా ఢమాల్ అవుతుండడంతో ఆమె ప్రి పిబ్లిసిటీ స్టంట్లో భాగంగానే ఈ గేమ్కు తెరలేపిందని అంటున్నారు. కనీసం ఇలా చెయ్యడం వల్ల అయినా నలుగురి నోళ్లలో నానవచ్చన్నదే ఆమె ప్లాన్ అట.
Related