మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు రెండేళ్లుగా ఏదీ కలిసి రావడం లేదు. చరణ్ వరస కష్టాల్లో పడుతున్నాడు. ఓ వైపు గోవిందుడు – బ్రూస్లీ సినిమాల ప్లాప్ తో కేరీర్ పరంగా యువ హీరోలతో పోల్చుకుంటే.. టాప్ హీరోలతో వెనకపడిపోయిన చెర్రీ తన నెక్ట్స్ సినిమా విషయంలో చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాడు.
తమిళంలో సూపర్ హిట్ అయిన తనీ ఒరువన్ సినిమాని తెలుగులో ధృవగా రీమేక్ చేస్తున్నాడు. ముందుగా ఈ సినిమాని దసరాకు ఆ తర్వాత దీపావళికి రిలీజ్ చేయాలనుకున్నారు. మొత్తానికి ఈ చిత్రం డిసెంబర్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ లో చరణ్ ఒంటరిగా వచ్చి రికార్డులను కొల్లగొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఇంతలో దెబ్బ మీద దెబ్బ అన్నట్లు ధృవకు మరో పెద్ద దెబ్బ తగిలింది. పెద్ద నోట్లు రద్దు చేయడం ఆ ఎఫెక్ట్ సినిమా పరిశ్రమపై బాగా పడింది.
ఈ నెపథ్యంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత వస్తున్న తొలి సినిమా ధృవే కావడం విశేషం. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిన కలెక్షన్లు రావడం కష్టమే అంటున్నారు. దీంతో చెర్రీ ఆశించినట్టు ధృవ ఎంత హిట్ అయినా రికార్డులు కొల్లగొట్టి ఇండస్ట్రీ హిట్ అవ్వడం కష్టంగానే కనిపిస్తోంది. ఇక ఈ ఎఫెక్ట్ సంక్రాంతి సినిమాల మీద కూడా ఉండనుంది. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న బాలయ్య శాతకర్ణితో పాటు చిరు 150 వ సినిమా ఖైదీ నెంబర్ 150పై కూడా ఈ ప్రభావం ఉంటుంది. ఖైదీ నెంబర్ 150 సినిమాకు నిర్మాత చెర్రీయే కావడంతో చెర్రీకి ఇప్పుడు ఈ నోట్ల రద్దు వ్యవహారంతో అటు ధృవ, ఇటు ఖైదీ సినిమాలకు పెద్ద దెబ్బ పడనుంది. సో ఇలా అన్ని కారణాలు కలిపి చెర్రీకి ఇప్పుడు పెద్ద దెబ్బేస్తున్నాయి.
Related