వరుస సినిమాలు పరాజయం పొందుతున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఈసారి తన కుమారుడు ఆకాశ్ను కథానాయకుడి పరియం చేస్తూ ఓ సినిమా రూపొందిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ ఇటీవల విదేశాల్లో ప్రారంభమైంది. జ్యోతిలక్ష్మి అదేనండి చార్మి వచ్చి క్లాప్ కొట్టింది. ఆ విధంగా ప్రారంభమైన సినిమాలో ఆకాశ్ సరసన నటిస్తున్నది కన్నడ భామ నేహాశెట్టి. ఈ భామను పూరీకి రికమెండ్ చేసింది రకుల్ప్రీత్సింగ్ అని తెలుస్తోంది. రకుల్కు నేహాశెట్టికి ఏం సంబంధం? ఎందుకు రికమెండ్ చేసింది? ఇంతకు నేహాశెట్టి ఎవరు? అని మీరనుకుంటున్నారు కదా!
ఇంతకు ముచ్చటేంటంటే నేహాశెట్టి కన్నడలో నటిస్తోంది. అక్కడ అంతగా గుర్తింపు దక్కలేదు. ఈ నేపథ్యంలో తన బాయ్ఫ్రెండ్ అమన్ను సంప్రదించింది. ఇంతకు అమన్ ఎవరంటే తెలుగులో టాప్ హీరోయిన్గా ఉన్న రకుల్ప్రీత్సింగ్ తమ్ముడు. అతగాడు తన ప్రేయసి కోసం తన అక్కకు సినిమాల అవకాశాల కోసం అడిగాడు. ఆ విధంగా రకుల్ నేహాశెట్టిని పూరీ జగన్నాథ్కు రికమెండ్ చేశారని వినికిడి. ఆ విధంగా తన మరదలను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేస్తోంది. ఆ విధంగా మొహబూబా సినిమాలో నేహాశెట్టి అవకాశం కొట్టేసింది. ప్రస్తుతం ఆ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
https://www.youtube.com/watch?v=jnD2E4YG9Uw