Thursday, April 25, 2024
- Advertisement -

బాల‌కృష్ణ వంద‌వ చిత్రం గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ప్రారంభ‌మైంది!

- Advertisement -

నంద‌మూరి బాల‌కృష్ణ వంద‌వ చిత్రం గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి అన్న‌పూర్ణ స్టూడియోలో సి.ఎం కె.సి.ఆర్  స‌మ‌క్షంలో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ చిత్రానికి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా… ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై బిబో శ్రీనివాస‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో  వై.రాజీవ్ రెడ్డి, జాగ‌ర్ల‌మూడి సాయిబాబు సంయుక్తంగా  నిర్మిస్తున్నారు.

బాలయ్య వందో సినిమా కావాడంతో ఈ సినిమాపై ఇప్పటి నుంచే అభిమానులో భారీగా అంచనాలు ఏర్పడాయి. ఈ సినిమా వేడుకకు సినీ పరిశ్రమ నుంచి పెద్ద పెద్ద స్టార్స్ తో పాటు సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులందరు విచ్చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.సి.ఆర్ గారు కూడా ఈ కార్య క్రమాన్నికి వచ్చారు. అలాగే చిరంజీవి, వెంకటేష్, దాసరి నారాయణ రావు, రాగవేంద్ర రావు వంటి వారు వచ్చారు.

సినీ ప్రముఖుల నుండి అందరు వచ్చారు బాగనే ఉంది కానీ బాలయ్య కుటుంబన్నికి సంబంధించి సినీ పరిశ్రమలో ఉన్న ఒక్క హీరో కూడా రాలేదు. అంతేందుకు హరికృష్ణ ఈ కార్యక్రమాన్నికి రాలేదు. మరి బాలయ్య హరి కృష్ణను పిలిచాడా? లేదా? ఒక వేళ బాలయ్య పిలిచిన హరి కృష్ణ రాలేదా? హరి కృష్ణ తనయుడు జూనీయర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎవరు ఈ వేడుకలో కనిపించలేదు. కొన్ని రోజులుగా బాలయ్యకు హరి కృష్ణ కు మధ్య విబేదలు ఉన్నాయి అనే వార్తలు వస్తున్న విషయం తెసిందే.

మరి హరికృష్ణ కుటుంబం ఈ వేడుకకు రాకపోవడానికి కారణం ఎమిటో బాలయ్యకే తెలియాలి. అలాగే సినీ పరిశ్రమలో చిరంజీవి, నాగర్జున, బాలకృష్ణ, వెంకటేష్ ఈ నాలుగురు హీరోలు ఒక తరం వారు. మరి బాలయ్య చిరును, వెంకీని పిలిచి నాగ్ ను ఎందుకు పిలవనట్లు?. ఒక వేళ బాలయ్య పిలిచిన నాగ్ రాలేదా? అసలు సంగతీ ఏంటో బాలయ్యకే తెలియాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -