Tuesday, April 30, 2024
- Advertisement -

ఈ హీరోయిన్లను పరిచయం చేసింది పూరీ జగన్నాదే?

- Advertisement -

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తెలుగు తెరపై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ “బద్రి”. తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, పోకిరి, చిరుత, నేనింతే, బిజినెస్ మాన్, టెంపర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీలకు దర్శకత్వం వహించి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు.

అలాగే పూరి జగన్నాథ్ ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ ను తెలుగు తెరకు పరిచయం చేశాడు. వారిపై ఓ లుక్కేద్దాం. తెలుగులో పూరి జగన్నాథ్ మొదటి చిత్రం బద్రి ఈ మూవీలో రేణు దేశాయ్, అమీషా పటేల్‌ ఇద్దరు హీరోయిన్స్ ను పరిచయం చేశాడు. తర్వాత ‘బాచి’ మూవీతో నీలాంబరి ,ఇడియట్ మూవీతో రక్షితను ,అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాతో అసిన్‌ను, నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘సూపర్’ సినిమాతో అనుష్క శెట్టిని ,అయేషా టకియా టాలీవుడ్ కు పరిచయం చేయగా అనుష్క శెట్టి టాలీవుడ్ అగ్ర కథానాయికగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Also read:ఆచార్య గురించి మరో క్రేజి బజ్.. సినిమాలో ఆ సాంగే హైలెట్?

అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ ‘దేశ ముదురు’ సినిమాతో హన్సికను ,చిరుత సినిమాతో నేహా శర్మను , హార్ట్ ఎటాక్ మూవీతో అదాశర్మను,తాజాగా పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై విజయ్ దేవరకొండతో హీరోగా వస్తున్న ‘లైగర్’ మూవీతో అనన్య పాండేను హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.

Also read:ఈ ఫొటోలో ఉన్న పాప ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -