సామాజికంగా, సినిమా వారి విషయాల్లో తప్ప రాజకీయ వేత్తల తో అంత చనువుగా ఉండని నాగార్జున కి వై ఎస్ రాజశేకర రెడ్డి తో సత్సంబంధాలు ఉన్నాయి.
అప్పట్లో ఆయన కోసం వివిధ రకాల యాడ్ లు కూడా చేసారు ఆయన. చాలా తెలివైన వ్యక్తి గా ఎవరితో ఎప్పుడు ఎలా మెలగాలో తెలిసిన పూర్తి డిప్లొమటిక్ వ్యక్తి గా నాగార్జున కి చాలా మంచి పేరు ఉంది. సినిమాలతో పాటు బుల్లితెర మీద కూడా హంగామా చేస్తున్న నాగార్జున మరొక పక్క తన వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా దిగ్విజయం గా నడుపుతున్నాడు. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన నిమ్మగడ్డ మనోడికి అత్యంత సన్నిహితుడు.
ఒక రకంగా చెప్పాలంటే నిమ్మగడ్డ.. నాగార్జున.. మరో పారిశ్రామికవేత్త, కేవీపీ వియ్యంకుడు రఘురామ కృష్ణంరాజు, పీవీపీ వీరంతా జగన్ గూటి పక్షులే. ఇంతకీ విషయం ఏంటంటే నితిన్ సామాజిక వర్గానికే చెందిన జగన్ మోహన్ రెడ్డి అఖిల్ సినిమా లో పెట్టుబడులు పెట్టాడు అని వార్తలు వస్తున్నాయి.
పీవీపీ , నిమ్మగడ్డ ఈ సలహా జగన్ కి ఇవ్వడం జరిగింది అయిన్ దాదాపు నలభై ఐదుకోట్లు ఈ సినిమా మీద జగన్ పెట్టాడు అంటున్నారు. టాలీవుడ్ లో అఖిల్ అన్న నాగ చైతన్య కే పెద్దగా మార్కెట్ లేని పరిస్థితి లో చైతన్య ముప్పై కోట్లు రాబడితే గొప్ప అంటున్నారు. ఇలాంటి పరిస్థితి లో ఇంత పెట్టుబడి పెట్టడం వెనక చాలా ఆలోచన ఉంది అంటున్నారు. సినిమా ల పరంగా ఎన్టీఆర్, పవన్ తెలుగు దేశానికి క్లోజ్ అయితే మహేష్ న్యూట్రల్ గా ఉంటున్నాడు, అక్కినేని ఫామిలీ నుంచి వచ్చే స్టార్ హీరో ని ముందు నుంచే తన వాడుగా మార్చుకుందాం అని జగన్ ప్లాన్ అట. మరొ వైపు ఇది ఒట్టి రుమ్ ర్ మాత్రమే అంటున్నారు.