Thursday, April 25, 2024
- Advertisement -

నౌగామ్ సెక్టార్‌లో పాక్ కాల్పుల‌ను తిప్పికొట్టిన భార‌త్‌..ఇద్ద‌రు పాక్ సైనికులు మృతి

- Advertisement -

కొత్త సంవ‌త్సం వేల పాకిస్థాన్ ప‌న్నిన కుట్ర‌ను భ‌గ్నం చేసింది ఇండియ‌న్ ఆర్మీ. నౌగామ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి ఆదివారం తెల్లవారుజామున పాక్ సైన్యం దాడుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంది. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు పాకిస్తానీ సైనికులు మృతి చెందినట్లు ఆర్మీ ప్ర‌తినిధి పేర్కొన్నారు.

నియంత్రణ రేఖ వెంబడి నవోగామ్‌ సెక్టార్‌ వద్ద మోర్టార్లు, రాకెట్లతో పాక్‌ సైనికులకు దాడులకు పాల్పడ్డారని తెలిపారు. ఈ చర్యలతో అప్రమత్తమైన భారత సైన్యం ఎదురుదాడి చేయడంతో వారు తప్పించుకున్నారన్నారు. సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కదలికలను సైన్యం సకాలంలో గుర్తించి అప్రమత్తమైందని, ఆదివారం ఉదయం ప్రారంభమైన కాల్పులు రాత్రి వరకూ కొనసాగాయని ఆయన తెలిపారు.

అనంతరం అటవీ ప్రాంతంలో సైన్యం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినప్పుడు రెండు మృతదేహాల‌తో పాటు భారీ సంఖ్యలో ఆయుధాలను కూడా అక్కడ గుర్తించినట్టు పేర్కొన్నారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, ఆ ప్రదేశాన్ని సైన్యం శుభ్రం చేస్తోందని ఆయన అన్నారు.ఇవన్నీ గమనిస్తుంటే భారీ స్థాయిలోనే కుట్రకు ప్రణాళిక రచించినట్లు అర్థమవుతోందన్నారు. నూతన సంవత్సరం వేడుకల్లో మునిగి ఉన్న వేళ భారత సైనికులను మట్టుబెట్టి, దేశంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -