అప్పటి వరకు ఎంతో ఆనందంగా కనిపించి మన కళ్ల ముందు ఉన్నవారు హఠాత్తుగా కనిపించకుండా తిరిగి రాని లోకానికి వెళ్తే ఆ కుటుంబ సభ్యులు పడే ఆవేదన అంతా ఇంతా కాదు. తాజాగా రెండు కుటుంబాల్లో విహార యాత్ర విషాదం నింపింది. ఈ దారుణ ఘటన కడప జిల్లాలో గురువారం చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కడప పట్టణం బెల్లంమండీవీధికి చెందిన ఫర్వేజ్ఖాన్ కుటుంబం తమ ఇంటి పక్కనే నివసిస్తున్న సమీప బంధువులతో కలిసి విహారయాత్రకు వెళ్లింది.
మొదట వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వద్ద కొద్ది గంటలు ఆనందంగా గడిపారు. అనంతరం పుష్పగిరి ఆలయ సమీపంలోని పెన్నా నదీ తీరానికి చేరుకుని అక్కడ కొద్ది సేపు గడిపారు. ఈ క్రమంలోనే పిల్లలు నదిలో దిగే ప్రయత్నం చేయడంతో మొదట పర్వేజ్ ఖాన్ కుమార్తె జవేరియా నదిలోకి దిగి గల్లంతయ్యింది. పఠాన్ అబ్దుల్ రషీద్, పఠాన్ అనుస్ఖాన్(15), పఠాన్ అబ్దుల్ వాహీద్ఖాన్ (19) ఆమె కోసం వెళ్లారు.
నదిలో పెద్ద మడుగులుండడంతో అందులో చిక్కుకుని నలుగురు గల్లంతయ్యారు. వారిని కాపాడేందుకు విశ్వప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు.. దాంతో పోలీసులకు సమాచారమివ్వడంతో వారు అక్కడకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. పఠాన్ అబ్దుల్ రషీద్, పఠాన్ జవేరియా, పఠాన్ అనుస్ఖాన్ మృతదేహాలు లభ్యమయ్యాయి. పఠాన్ అబ్దుల్ వాహిద్ ఖాన్ కోసం గాలింపు కొనసాగుతోంది. అప్పటి వరకు తమ కళ్ల ముందు ఉన్నవారు చనిపోవండంతో ఇరు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
నేను అవార్డులు తీసుకున్నప్పుడు లోకల్.. నాన్ లోకల్ అని అనలేదే?ప్రకాష్ రాజ్ ప్రశ్న