Saturday, April 27, 2024
- Advertisement -

హుజూరాబాద్ లో ‘దుబ్బాక’ సీన్ మళ్లీ రిపీట్ అవుతుంది : ఎమ్మెల్యే రఘునందన్ రావు

- Advertisement -

తెలంగాణలో అధికార పార్టీ ఎన్ని ఎత్తులు.. జిత్తులు పన్నినా హుజూరాబాద్ లో మరోసారి దుబ్బాక సీన్ రిపీట్ అవుతుందని అన్నారు దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్ రావు. తెలంగాణ రాజకీయాలు హుజూరాబాద్ ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి. ఇటీవల మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కు గురైన ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడంతో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక జరగబోతున్న విషయం తెలిసిందే.

టీఆర్ఎస్ కి గుడ్ బాయ్ చెప్పిన తర్వాత ఢిల్లీలో ఈటెల రాజేందర్ బీజేపీ కండువ కప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈటలను మళ్లీ గెలిపించేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. తాజాగా హుజూరాబాద్ ఎన్నిక విషయం పై దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్ రావు స్పందించారు.

మొన్న దుబ్బాకలో ఎలాంటి ఫలితం వచ్చిందో, రేపు హుజూరాబాద్ లోనూ అదే పునరావృతం అవుతుందని పేర్కొన్నారు. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ పై ప్రజలు ఎంతో విశ్వాసం, అభిమానం చూపిస్తున్నారని అది ఆ నియోజకవర్గ ప్రజలకు చేసిన సేవ వల్లనే అని అన్నారు. టీఆర్ఎస్ కి గట్టి బుద్ది చెప్పాలంటే.. బీజేపీ శ్రేణులు దుబ్బాక కంటే కాస్త ఎక్కువే శ్రమించాల్సి ఉంటుందని రఘునందన్ రావు పిలుపునిచ్చారు. హుజూరాబాద్ లో బీజేపీ మండలాల ఇన్చార్జిల సమావేశంలో రఘునందన్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.

శ్రావణి గానం అద్భుతం.. తప్పకుండా అవకాశం ఇస్తా : దేవిశ్రీ ప్రసాద్

పన్నీర్ పాయసం ఎప్పుడైనా తిన్నారా.. ఒక్కసారి ట్రై చేస్తే?

ఫ్రైడ్ రైస్ లో బొద్దింక… రెస్టారెంట్‌పై నటి నివేదా పేతురాజ్‌ ఫైర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -