- Advertisement -
గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకంది. సిమెంట్ బస్తాలతో వెళ్తున్న ఓ ట్రక్కు బోల్తా పడిన ఘటనలో 19 మంది దుర్మరణం పాలయ్యారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. భావ్నగర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై బవల్యాలి సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
సిమెంట్ బస్తాల కింద ఇరుక్కుపోవడంతో చాలా మంది ఊపిరాడక ప్రాణాలు వదిలారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారంతా సుల్తాన్పూర్ వాసులుగా తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే బవల్యాలిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Gujarat: 19 people killed, 7 injured after a cement laden truck turned turtle on Bhavnagar-Ahmedabad highway, near Bavalyali village in Bhavnagar this morning. pic.twitter.com/2RIkj90nBx
— ANI (@ANI) May 19, 2018