Monday, May 6, 2024
- Advertisement -

అమితాబ్ షూటింగ్ సమీపంలో కాల్పుల కలకలం

- Advertisement -

ముంబై ఫిల్మ్ సిటీలో శుక్రవారం కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. స్టూడియో నెంబర్ -2 వద్ద బాలీవుడ్ బాద్షా అమితాబ్ చిత్రం షూటింగ్ జరుపుకుంటున్న ప్రాంతంలో ఆగంతకులు 3 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు అక్కడికక్కడే చనిపోగా… మరోకరు తీవ్రంగా గాయపడ్డారు.

దుండగులు అక్కడి నుంచి పరారైయ్యారు. స్టూడియో సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రుడ్ని ఆసుపత్రికి తరలించారు. దుండగులు బాబు షిండే అనే వ్యక్తి లక్ష్యంగా ఈ కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షలు వెల్లడించారు. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముంబై మహానగరంలో మాఫియా ఆగడాలు ఇటీవల కాలంలో పెచ్చురిల్లాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -