Thursday, May 9, 2024
- Advertisement -

ఔట‌ర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్ర‌మాదం…ఒకే కుంటుంబానికి చెందిన ముగ్గురు మృతి

- Advertisement -

హైదరాబాద్ నగర శివారులోకి కీసర వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. అతి వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దినేశ్‌ కుమార్‌ అనే వ్యక్తి తన భార్య సాగరిక, మూడు నెలల బాబు రుషీకేశ్‌తో కలిసి తన కారులో కీసర వైపు వెళ్తుండగా.. రాంపల్లి – దయార బ్రిడ్జి వద్ద వాహనం అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. పెద్ద శబ్దంతో కాస్త దూరంలో నిలిచిపోయంది. ప్రమాద తీవ్రతకు కారులో ప్రయాణిస్తున్న వారంతా అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. దినేశ్ కుమార్ ఉప్పల్‌లో అపోలో ఫార్మసీలో మేనేజర్‌గా పని చేస్తున్నట్లు సమాచారం. వీరి స్వస్థలం ఝార్ఖండ్‌ రాష్ట్రం జంషెడ్‌పూర్‌‌గా తెలుస్తోంది. కీసర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -