Friday, May 17, 2024
- Advertisement -

ఐదేల్ల బాలిక‌జీవితాన్ని దేవుడి ముందే చిదిమేసిన ఇద్ద‌రు పూజారులు..

- Advertisement -

గుడికి వెల్లిన భ‌క్తుల‌కు పూజారులు పూజ చేసి ఆశీర్వ‌చ‌నాలు అందిస్తారు. అలాంటి పూజారులే దారుణానికి వ‌డిగ‌ట్టారు. ఐదేళ్ల బాలికపై అత్యాచారినికి వ‌డిగ‌ట్టారు. ఆలయంలో నిత్యం దేవుడికి పూజలు చేసే వారే ఈ దారుణానికి దిగడం సంచలనం సృష్టించింది.మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది.

మధ్యప్రదేశ్ లోని దాతియా జిల్లాలో ఓ బాలిక(5) తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలో ఊరిలోని పూజారులు రాజు పండిత్(55), బతోలీ ప్రజాపతి(45)లు చిన్నారిపై కన్నేశారు. మిఠాయిలు కొనిస్తామని ఆశ చూపి ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం అత్యాచారం చేశారు. నిందితుల‌ను పోలీసులు అరెస్ట్ చేశాక‌సి వారిపై అత్యాచారం, పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఈ ఘటన తర్వాత బాధితురాలు ఏడుస్తూ ఉండటంతో మిఠాయిలు కొనిచ్చి ఇంటి వద్ద దించారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించారు. అయితే బాలిక మాత్రం నొప్పితో విల్లవిల్లాడుతూ ఉండటంతో తల్లి ప్రశ్నించింది. దీంతో అసలు విషయాన్ని బాలిక బయటపెట్టింది.దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

12 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసు మహిళలపై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష విధించే బిల్లును గతేడాది డిసెంబర్ లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ గత ఏడు నెలల్లో 12 మంది దోషులకు కోర్టులు మరణదండన విధించాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -