Monday, May 20, 2024
- Advertisement -

ఆఫ్ఘ‌న్‌లో ఏడుగురు భార‌తీయ ఇంజ‌నీర్లు కిడ్నాప్..

- Advertisement -

ఆఫ్ఘనిస్థాన్ లో ఏడుగురు భారతీయులు కిడ్నాప్ నకు గురయ్యారు. బాగ్లాన్ ప్రావిన్స్ ప్రాంతంలోని ఓ పవర్ ప్లాంట్ లో ఈ ఏడుగురు ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని ఆఫ్ఘాన్ ప్రభుత్వం ధ్రువీకరించింది. ఈ ఏడుగురిని తాలిబన్లు కిడ్నాప్ చేసినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బాగ్లాన్ పోలీస్ అధికార ప్రతినిధి జబిహుల్లా షుజా మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్వహణలోని ఓ పవర్ స్టేషన్ కు ఈ ఏడుగురు ఇంజనీర్లు మినీ బస్సులో ఈరోజు వెళుతుండగా గుర్తుతెలియని సాయుధులు బస్సును అడ్డగించి వారిని అపహరించుకుపోయార‌ని తెలిపారు.

ఈ సంఘటనపై కాబూల్ లోని భారత్ ఎంబసీకి చెందిన ఉన్నతాధికారులు మాట్లాడుతూ, విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఆఫ్ఘనిస్థాన్ బ్రెష్నా షెర్ఖాత్ (డీఏబీఎస్)లో ఈ ఏడుగురు ఇంజనీర్లు పనిచేస్తున్నారని, కిడ్నాపర్ల చెర నుంచి వారిని విడిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇంత వరకూ కిడ్నాప్ చేసింది తామేనని ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -