Saturday, May 4, 2024
- Advertisement -

టర్కీలో ఘోర ప్రమాదం..9 మంది మృతి..!

- Advertisement -

టర్కీలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలోని ఐసీయూలో ఆదివారం తెల్లవారుజామున ఆక్సిజన్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో 9 మంది కొవిడ్ బాధితులు మృతి చెందారు. వీరంతా 56 నుంచి 85 ఏళ్ల వయసున్నవారేనని ఆసుపత్రి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనట్లు స్థానిక వార్తా సంస్థ తెలిపింది. ఐసీయూలో చికిత్స పొందుతున్నవారిని ఇతర ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించింది.

ఘటన జరిగిన సమయంలో అక్కడి యూనిట్​లో 19 మంది బాధితులు ఉన్నారని అధికారులు తెలిపారు. మృతులు మినహా ఇంకెవరికీ గాయాలు కాలేదని చెప్పారు.కరోనా తీవ్రత కారణంగా టర్కీలోని ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. ఐసీయూ విభాగాలు 74 శాతం ఆక్యుపెన్సీతో పనిచేస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -