Friday, May 3, 2024
- Advertisement -

కూతురితో పాటు ఇంటిపైనుంచి దూకిన త‌ల్లి

- Advertisement -

ఆవేశంలో తీసుకునే ఏ నిర్ణ‌య‌మైనా ఎంతో దుఃఖాన్ని మిగులుస్తుంది. కార‌ణాలు ఏమైనా కావొచ్చు.. ప్ర‌తీ ఒక్క‌రూ ఒకసారి ఆలోచించాలి. నేను ఏం చేస్తున్నాను. ఇప్పుడేం చేయాల‌ని.. అలా కాకుండా ఆవేశంలో నిర్ణ‌యాలు తీసుకోవ‌ద్దు. అలా ఆవేశంలో ఒక త‌ల్లి తీసుకున్న నిర్ణ‌యం వ‌ల‌న 8 నెల‌ల చిన్నారిని ప్రాణాపాయంలోకి నెట్టింది.

ఈ ఘ‌ట‌న‌ బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై కన్నెబోయిన ఉదయ్ తెలిపిన‌‌ కథనం ప్రకారం.. బిహార్‌కు చెందిన బిమల్‌కుమార్ కొద్ది కాలం ముందు న‌గ‌రానికి వ‌చ్చారు. ఇక్క‌డే స్థిర‌ప‌డిన ఆయ‌న వంటమనిషిగా ఒక‌రింట్లో పనిచేస్తూ.. జీవ‌నం కొన‌సాగిస్తున్నాడు.ఆయ‌న‌ భార్య ఆర్తి(22), వాళ్ల‌కు ఎనిమిది నెలల కూతురు ఉంది. కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. అదే విధంగా సోమవారం రాత్రి విధుల నుంచి వచ్చిన బిమల్‌కుమార్ త‌న భార్య ఆర్తితో గొడ‌వ‌కు దిగాడు.

భోజనం త్వరగా చేయాలనే విషయంలో జ‌రిగిన గొడ‌వ‌లో ఆర్తి విచ‌క్ష‌న కోల్పోయింది. దాంతో కోపంతో కూతురుని తీసుకుని బ‌య‌ట‌కు వ‌చ్చి రెండో అంతస్తులోకి వెళ్లింది. అక్క‌డి నుంచి అలానే కూతురుతోపాటు కిందకు దూకింది. దీంతో ఆమె, త‌న కూతురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ఆస్పత్రికి తీసుకుపోయినా కూడా ఫ‌లితం లేక‌పోయింది. ప‌రిస్థితి విష‌మించి ఆర్తి చ‌నిపోయింది. త‌న కూతురు పరిస్థితి కూడా విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపిన‌ట్లు పోలీసులు చెబుతున్నారు.

డ‌బ్బుల కోసం క‌న్న తల్లినే చంపేశాడు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -