Wednesday, April 24, 2024
- Advertisement -

బైడెన్ బృందంలో మొత్తం భారతీయులకి చోటు.. ఇప్పుడు మరో మహిళ..!

- Advertisement -

అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న జో బైడెన్ బృందంలో మరో భారతీయ- అమెరికన్​కు చోటు లభించింది. భారత సంతతికి చెందిన సమీరా ఫాజిల్​ను యూఎస్​ నేషనల్​ ఎకనామిక్​ కౌన్సిల్​కు ఎంపిక చేస్తూ బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో తయారీ, ఆవిష్కరణలు, దేశీయంగా పోటీ వంటి అంశాలను సమీరా పర్యవేక్షించనున్నారు. స్వేతసౌధం డిజిటల్​ విభాగంలో కశ్మీరీ మహిళ ఐషా షాని ఎంపిక చేసిన కొన్ని వారాల తర్వాత.. ప్రస్తుతం సమీర ఎంపిక ప్రకటన వెలువడడం గమనార్హం.

కశ్మీర్​ మూలాలున్న సయ్యద్​ యూసఫ్, రఫిఖా ఫాజిల్​ దంపతుల కుమార్తె సమీరా ఫాజిల్​. సమీరా పూర్వీకులు అమెరికాలో స్థిరపడగా.. ఆమె ప్రస్తుతం క్లినికల్​ లెక్చరర్​గా ఆమె ప్రస్తానాన్ని మొదలు పెట్టారు. రిజర్వ్ బ్యాంక్​ ఆఫ్​ అట్లాంటాలో సామాజిక ఆర్థిక అభివృద్ధి శాఖకు డైరెక్టర్​గా పనిచేశారు. ట్రెజరీ డిపార్ట్​మెంట్​లోనూ ఆమెకు పనిచేసిన అనుభవం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -