Friday, May 17, 2024
- Advertisement -

ఏబిఎన్ పై పరువు నష్టం దావా వేస్తా అంటున్న మంత్రి

- Advertisement -

నా  మీద వచ్చిన ఆరోపణలకు నేను లైవ్ టీవీలో లై డిటెక్టర్ పరీక్షలకు నేను సిద్దం. చంద్రబాబు సిద్దమా! దమ్ముంటే చెప్పమనండి అని తెలంగాణ మంత్రి కేటిఆర్ చంద్రబాబుపై మీడియా ద్వారా  సవాలు విసిరారు. తెలుగు ప్రజల ప్రతిష్టను దిగజరుస్తున్నారని, ఇది చంద్రబాబుకు వచ్చిన సమస్య తప్ప రెండు రాష్ట్రాల సమస్య కానే కాదని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కూడా దీన్ని ఖండించాలని ఆయన పేర్కొన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ఓటుకు నోటు వ్యవహారం వీడియో టేప్ బయట పడుతూనే చంద్రబాబు ఎందుకు స్పందించలేదని, రేవంత్ రెడ్డిని ఎందుకు బహిష్కరించలేదని ఆయన మండి పడ్డారు. చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు. వీటిని చూస్తూ ప్రజలు ఊరుకోరని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, చట్టానికి ఎవరూ అతీతులు కారని ఆయన మీడియాతో తెలిపారు.

తప్పుడు ప్రచారాలు చేస్తున్న ఏబిఎన్ చానల్‌పై పరువు నష్టం దావా వేస్తానని కేటిఆర్ తెలిపారు. సిగ్గు లేకుండా ఏబిఎన్ టిడిపి కి మద్దతు పలుకుతోందని ఎద్దేవా చేశారు. 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -