Monday, April 29, 2024
- Advertisement -

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం..!

- Advertisement -

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జల్గావ్ జిల్లాలో కింగ్వాన్ దగ్గర ట్రక్కు బోల్తా పడటంతో 15 మంది కూలీలు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. మరణించిన వారిలో ఏడుగురు పురుషులు, ఆరుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయానికి ట్రక్కులో మొత్తం 21 మంది ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

ట్రక్ బొప్పాయి పంటను మార్కెట్‌కు తీసువెళ్తుండగా ఈ దారుణం జరిగింది. ట్రక్కులో నింపిన బొప్పాయి పంటపైన ప్రాణాలు కోల్పోయిన కూలీలు కూర్చున్నాడు. ఈ రహదారిలో చాలా గుంతలు ఉండటం వల్లే ట్రక్ బోల్తా పడిందని స్థానికులు చెబుతున్నారు.

అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఫోటో ఫీచర్ : అందమైన చిరునవ్వు చిందిస్తున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

ప్రేమికుల దినోత్సవానికి భార్యకు ఇచ్చిన గిఫ్ట్ తెలిస్తే.. షెభాష్ అంటారు!

స్టీల్ సిటీలో లోకేష్ గర్జన..ఉపేక్షించేది లేదు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -