Thursday, April 25, 2024
- Advertisement -

స్టీల్ సిటీలో లోకేష్ గర్జన..ఉపేక్షించేది లేదు..!

- Advertisement -

ఆంధ్రులకు అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదని నారా లోకేశ్ స్పష్టం చేశారు. గాజువాకలో ఆయన పర్యటించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పల్లా శ్రీనివాసరావుకు నారా లోకేశ్ సంఘీభావం తెలిపారు. టిడిపి హయాంలో అదాని డేటా సెంటర్‌ తీసుకువచ్చామని లోకేశ్ అన్నారు.

వైసిపి హయాంలో ఒక్క ఐటీ పరిశ్రమ తీసుకువచ్చారా? అని ప్రశ్నించారు. ఇక్కడ ఉన్న పరిశ్రమలను వెనక్కి పంపేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న విశాఖలో ప్రశాంతత లేకుండా చేశారన్నారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశంమని టిడిపి నేత పల్లా శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనందునే ఆమరణ దీక్షకు దిగానని స్పష్టం చేశారు. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ప్రైవేటీకరణ ఆపాలన్నారు. నాలో ప్రాణం ఉన్నంత వరకు పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.

పుష్ప ఔట్ ఒక రేంజిలో వచ్చిందట!

అల్లరి నరేష్ ‘నాంది’ సెన్సార్ రివ్యూ!

ప్రెండ్లీ గవర్నమెంట్ అంటూ.. పీఆర్‌సీ కి కన్నం..!

హైదరాబాద్ ని యూటీ చేస్తారా.. మజ్లిస్‌ పై కేంద్ర మంత్రి ఫైర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -