ప్రపంచంలో కరోనా వైరస్ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎవ్వరినీ వదలడం లేదు. సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన వారు కరోనా వైరస్ కి బలి అవుతున్నారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నడుస్తుంది. కొద్ది రోజుల క్రితం రణ్బీర్ కపూర్, సంజయ్ లీలా భన్సాలీ తమకు కరోనా సోకిందని ప్రస్తుతం క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు.
బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్ధి కి కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. నాతో కాంటాక్ట్ అయిన వాళ్లు కూడా దయచేసి పరీక్షలు చేయించుకోండి. నాకు ఎలాంటి లక్షణాలు లేవు. మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాలు.
ఢిల్లీలోని ప్రముఖ ఆసుపత్రిలో ఆశిష్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. తాజాగా తెలుగు, హిందీ సినిమాలలో విలన్ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. ఆశిష్ విద్యార్ధి తెలుగులో పోకిరి, భాగమతి, జనతా గ్యారేజ్, అతిథి, అన్నవరం వంటి చిత్రాలలో పవర్ ఫుల్ పాత్రలు పోషించిన విషయం తెలిసిందే.
సన్నిహితుల సమక్షంలో… నటి మెహ్రీన్ నిశ్చితార్థం..!