నందమూరి కుటుంబం లో రోడ్డు ప్రమాదాలు వారిని కన్నీరు మున్నీరు చేస్తున్నాయి. ఇప్పటికే హరికృష్ణ కొడుకు జానకి రామ్ రోడ్డు ప్రమాదంలో మరణించగా ఇప్పుడు హరికృష్ణ కూడా అదే విధంగా మరణించడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. 2009లో తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేసి హైదరాబాద్ కు తిరిగి వస్తున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ భారీ యాక్సిడెంట్ కు గురయ్యాడు , తీవ్ర గాయాలతో మొత్తానికి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆసంఘటన వారి కుటుంబాన్ని ఓ కుదుపు కుదిపేసింది.
AP 29 GD 2323 నెంబర్ నందమూరి ఫ్యామిలీకీ దడ పుట్టిస్తోంది. ఈ నెంబర్ గత సఫారీ కారులోనే 2014లో డిసెంబర్ 6న రోడ్ యాక్సిడెంట్ లో హరికృష్ణ పెద్దకొడుకు నిర్మాత నందమూరి జానకిరామ్ చనిపోయాడు. సీన్ కట్ చేస్తే …అదే AP 29 BW 2323 నెంబర్ గత ఫార్చూనర్ కారులో పయనిస్తూ నందమూరి హరికృష్ణ తుది శ్వాస విడిచారు. 2323 నెంబర్ గత వాహనాలు నందమూరి ఇంట తండ్రీ , కొడుకులను బలి తీసుకున్నాయి.
ఇదంతా కాకతాలీయమో లేకా మూఢనమ్మకమోగాని సోషియల్ మీడియాలో ఇలాంటి కథనాలు వైరల్గా మారాయి.ఇప్పటికే నల్గొండ జిల్లాలో ముగ్గూరూ యాక్సిడెంట్కు గురికావడం హైలెట్కాగా..ప్రస్తుతం కారు నెంబర్ కూడా హాట్టాఫిక్గా మారింది.
హరికృష్ణ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయా? అంటే ఔననే సమాధానం వస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తృటిలో చావు నుండి తప్పించుకోగా, పెద్ద కొడుకు జానకిరామ్ ఇదే రోడ్డు ప్రమాదంలో చనిపోవడం ఇప్పుడేమో హరికృష్ణ చనిపోవడం ఆ కుటుంబాన్ని మరింతగా కృంగదీస్తోంది.