Thursday, April 25, 2024
- Advertisement -

సోషల్ మీడియాలో వచ్చిన వందంతులపై క్లారిటీ ఇచ్చిన పోసాని…

- Advertisement -

తన ఆరోగ్యంపై మీడియాలో వస్తున్న వదంతులకు పుల్ స్టాప్ పెట్టారు పోసాని. తాజాగా మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. తాను ఆరోగ్యంగా స్ట్రాంగ్ ఉన్నానని ఇప్పట్లో చచ్చిపోనని వెల్లడించారు. గతంలో తనకు ఆపరేషన్ చేసిన భాగాల్లో ఇన్ ఫెక్షన్ వచ్చిందని, అది వైద్యులు కనిపెట్టి, లండన్ నుంచి వచ్చిన వైద్యుడు తనకు మరో ఆపరేషన్ చేయడంతో బతికి ఉన్నానని లేకపోతే ‘మన శాల్తీ పైకి వెళ్లి పోయేది’ అని అన్నారు.

పోసాని కృష్ణమురళి ఆపరేషన్ విఫలం అయ్యిందంటూ సామాజిక మాధ్యమాల వేదికగా తనపై వదంతులు వ్యాపించాయని …ఇలాంటి వాటితో తన భార్య చాలా బాధపడ్డారని చెప్పారు. అసత్య కథనాల వల్ల తనకు సినిమా ఇండస్ట్రీలో వేషాలు ఇచ్చే వాళ్లు కూడా ఇవ్వరని, ‘పోసాని బతకడం చాలా కష్టమటగా’ అని ఇండస్ట్రీలో మాట్లాడుకోవడం తనకు తెలుసని చెప్పారు.

రెండు ఆపరేషన్లు చేశారని… ఒకటి మీరు (సోషల్ మీడియా) చెప్పినట్టుగా ఫెయిల్ అవలేదు. ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిపారు. రెండో ఆపరేషన్ ను డాక్టర్ ఎంవీ రావు గారు చేశారు. ఆయన వలనే నేను బతికా’ అని అన్నారు. గతంలో తన భార్యకు ‘నియోనియా’ వస్తే డాక్టర్ ఎంవీ రావే బతికించారని గుర్తుచేశారు. తనకు, తన భార్యకు పునర్జన్మ ఇచ్చింది ఈ డాక్టరేనని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -