- Advertisement -
సినీనటి రాయ్ లక్ష్మి కాలి నరాలకు ముంబయి ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగింది.
‘అధినాయకుడు’, ‘కాంచన’ తదుపరి చిత్రల్లో నటించిన రాయ్లక్ష్మి ఇటీవల హైదరాబాద్లో జరిగిన పాట షూటింగ్లో నటిస్తుండగా రెండు కాళ్లకు నొప్పులు రావటంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు కాలి నరాలు దెబ్బతిన్నట్టు తెలిపారు. వెంటనే రాయ్లక్ష్మి ముంబాయికి వెళ్లి, అక్కడా ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. గురువారం ఆమె రెండు కాళ్లలోని నరాలకు ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం రాయ్ లక్ష్మి ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘జూలీ 2’చిత్రాల్లో నట్టిస్తుంది.