Tuesday, April 30, 2024
- Advertisement -

మాధ‌వీల‌త మౌన‌దీక్ష భ‌గ్నం..అరెస్ట్‌ చేసిన పోలీస‌లు

- Advertisement -

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో టాలీవుడ్‌ను వణికిస్తున్న నటి శ్రీరెడ్డి.. పవన్ కళ్యాణ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. నిన్న‌టి వ‌ర‌కు మ‌ద్ద‌తు తెలిపిన ప‌లు సంఘాలు ఆమెవ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌డుతున్నాయి.

ఇదిలా ఉండగా టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ కల్చర్‌పై తొలిసారి పెదవి విప్పిన నటి మాధవీలత సైతం పవన్‌పై శ్రీరెడ్డి చేసిన వాఖ్యలను తీవ్రంగా ఖండించింది. శ్రీరెడ్డి వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయం ముందు మౌన దీక్ష చేపట్టింది. ఈ దీక్ష పవన్ కళ్యాణ్ అభిమానులు మద్దతు తెలుపుతున్నారు.

పవన్‌పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఓయూ జేఏసీ సైతం మండిపడింది. మాధవీలత మౌన దీక్ష సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో అక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మాధవీలత దీక్షను పోలీసులు గంటలోనే భగ్నం చేసి, ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

అమ్మ ఎవరికైనా అమ్మే. ఆమెను గౌరవించాలి, ఆధారాధించాలేగానీ.. అవమనించకూడదు. తిట్లతోనే కాకుండా మౌనంగా కూడా మన నిరసన వ్యక్తం చేయొచ్చు. పవన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నేనీ మౌన దీక్ష చేపడుతున్నా’’ అని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -