Sunday, May 19, 2024
- Advertisement -

భద్రత పెంచాలన్న కాంగ్రెస్ నేతలు

- Advertisement -

రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు. ఆయన్ని చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. పుదుచ్చేరి పార్టీ కార్యాలయానికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ లేఖలు పంపారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు అహ్మద్ పటేల్ , ఆనంద్ శర్మ కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి తమ నాయకుడు రాహుల్ గాంధీ భద్రతను పెంచాలంటూ విజ్ఞప్తి చేశారు.

బెదిరింపు లేఖలపై విచారణ జరిపించాలని కోరారు. కాగా, రాహుల్ గాంధీ మంగళవారం నాడు పుదుచ్చేరిలో జరిగే ఓ బహిరంగ సభలో పాల్గొననున్నారు. దీంతో స్ధానిక కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంపేస్తామంటూ రాసిన లేఖలు తమిళ బాషలో ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -