నంద్యాల ఉప ఎన్నిక పీవర్ అఖిలకు పట్టుకుంది. రాజకీయ భవిష్యత్తు అంతా ఈ ఉప ఎన్నికమీదనే ఆధారపడింది.వైసీపీ,టీడీపీ కంటె భూమా వర్గానికే ప్రతీష్టాత్మకంగా మారింది.
ప్రతికూల ఫలితాలు వస్తే భూమా అఖిలప్రియ రాజకీయమే తలక్రిందులవడంతోపాటు తీవ్రంగా నష్టపోవాల్సి స్తూంది.బ్రహ్మానందరెడ్డి ఓడిపోతే భూమా కుటుంబానికి రాజకీయంగా తెరపడే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పుడు ఇదే భూమా వర్గాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది.
{loadmodule mod_custom,GA1}
నంద్యాలలో ఏర్పాటు చేసిన ఇష్తార్లో జనసమీకరణతర్వాత ఆందోళన మొదలయ్యింది.50వేల మంది దాకా వస్తారనుకున్న విందుకు కనీసం ఐదువేలమందికంటె ఎక్కవ రాకపోవడంతో బాబు అఖిలప్రియతోపాటు టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తోడు ఇప్పుడు టీడీపీలోనే కొందరు విభీషణులు బయలుదేరారు.అఖిల మంత్రిఅయ్యాక ఆమె తీరును భరించలేకపోతున్న టీడీపీ నాయకులు ఈఎన్నికల్లో చెక్ పెట్టేందుకు ప్రణాలకలు రచిస్తున్నారు.
ముస్లింలలో మంచి పట్టున్న ఫరూక్, ఎస్పీవై రెడ్డి కూడాఅంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డి గెలిస్తే… శాశ్వతంగా నంద్యాల అసెంబ్లీ స్థానం తనదేనన్నట్టుగా ఫిక్స్అయిపోతారని టీడీపీలోని వైరి వర్గాలు ఆలోచన చేస్తున్నాయి. ఓడిపోతే తట్టాబుట్టా సర్దుకొని పోతుందని భావిస్తున్నారంట.
నంద్యాల నియోజకవర్గంలోని మండలస్థాయి టీడీపీ నేతలంతా శిల్పాతో టచ్లో ఉన్నారని… వారు లోలోన శిల్పా గెలుపునే కోరుకుంటున్నారని ప్రముఖ తెలుగు తటస్థ పత్రికలు కూడా చెబుతున్నాయి.టీడీపీలోని కొందరు నేతలు కూడా శిల్పా మోహన్ రెడ్డిపై సానుభూతితో ఉన్నట్టు చెబుతున్నారు. ఈ పరిస్థితికి భూమా అఖిలప్రియ అహమే కారణమంటున్నారు.
{loadmodule mod_custom,GA2}
మంత్రి పదవి చేపట్టిన వెంటనే జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని ఆమె కనీసం మర్యాద పూర్వకంగా కూడా కలవలేదని వార్తలొచ్చాయి.ఇలా పార్టీలోనే విభీషనులు తయారయ్యరని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read
- భూమా పరువును గంగలో కలిపిన మంత్రి అఖిలప్రియ…..
- అప్పుడే రాజకీయాలను వంటపట్టించుకున్న మంత్రి అఖిల ప్రియ…
- ఓడిపోతే మంత్రి పదవి గోవిందేనా…..?
- మా ఇలాకాలో మీపెత్తనమేంటి – భూమా అఖిలప్రియ
{youtube}pCe8J6i5y-4{/youtube}