జయలలిత ఆత్మ ఇక్కడే ఉందా..? అమ్మ ఆత్మ శాంతించలేదా? కొందరిని జయలలిత ఆత్మ భయపెడుతోందా ? జయలలితకు తీరని కోరికలు ఉన్నాయా..? జయలలిత ఆత్మ తనకు అన్యాయం చేసిన వారి వెంట పడుతోందా ? అంటే అవును అనే జవాబు వినిపిస్తోంది. జయలలిత మరణం తర్వాత ఆ మధ్య ఆమె ఆత్మ ఆస్పత్రిలోనే తిరుగుతుందని ప్రచారం జరిగింది.
అలానే అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో మెరీనా బీచ్ లోనే కనిపించిందని ప్రచారం సాగింది. ఇప్పుడు ఏపీలో అమ్మ ఆత్మ గురించి కొత్త కథనం బయటకు వచ్చింది. చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలం ఆరోం గ్రామంలో ఓ కారు నిలిపి ఉండడం రకరకాల చర్చలకు తావిస్తోంది. టీఎన్ 07-వీ 1948 నెంబరు ఉన్న ఆ కారు ముందుగా జయపేరుతో రిజిస్టర్ అయ్యి.. ఆ తర్వాత మరో ఇద్దరు వ్యక్తుల చేతుల్లోకి మారినట్టు తెలుస్తోంది. ఆ కారుపై ఇష్టంతోనే అమ్మ ఆత్మ ఆ కారు ఓనర్ను బెదిరించడంతో అతడు ఆ కారును ఏపీలోని చిత్తూరు జిల్లాలో వదిలేసి వెళ్లిపోయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అమ్మ మరణం తర్వాత ఆ కారు ఓనర్కు ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయట. ఎవరో తనను వెంటాడుతూ.. భయపడుతున్నాడట. దాంతో అతను ఆ కారును అక్కడే వదిలేసి వెళ్లినట్లు తెలుస్తోంది. జయలలిత ఆత్మ ప్రచారం మరీ ఎక్కువ కావడంతో చిత్తూరు జిల్లా పోలీసులు కారు గురించి ఆరా తీస్తున్నారు. కారు అక్కడికి ఎలా వచ్చిందన్న విషయంపై పోలీసులు విచారిస్తున్నారు. అసలు ఇదంతా నిజమా ? కాదా ? అన్నది పక్కన పెడితే రూమర్లు మాత్రం బాగా స్ప్రెడ్ అవుతున్నాయి.
{youtube}oLwI_sA0yeI{/youtube}
Related