మన దేశంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ఒక రకంగా చెప్పాలంటే ఫెయిల్ అయినట్టే. ఎందుకంటే ఇప్పటికే పంపిణీ సరిగ్గా జరగడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నెపం వేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాయే తప్ప. వ్యాక్సిన్ పంపిణీలో చిత్తశుద్ధితో వ్యవహరించలేదు. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే మనదేశంలో పంపిణీ అవుతున్న కోవాగ్జిన్, కోవిషీల్డ్ ఈ రెండు వ్యాక్సిన్లలో ఏది సమర్థవంతంగా పనిచేస్తుంది? అనేది ప్రజలకు ప్రశ్నగానే మిగిలిపోయింది.
ఏ వ్యాక్సిన్ తీసుకుంటే నిశ్చితంగా ఉండొచ్చు. ఏ వ్యాక్సిన్ తీసుకున్నా మాస్కు పెట్టుకోవాల్సిందే. భౌతికదూరం పాటించాల్సిందే. అయితే ఏ వ్యాక్సిన్తో రోగనిరోధక శక్తి ఎక్కువగా వస్తుంది? డెత్ రేట్ తక్కువగా ఉంటుందన్నదే ప్రశ్న. అయితే కోవాగ్జిన్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని.. కోవాగ్జిన్ తో పోల్చి చూస్తే.. కోవిషీల్డ్ అంత ప్రభావంతంగా పనిచేయడం లేదని తొలుత కొన్ని వార్తలు వచ్చాయి. దీంతో ప్రజలు కోవాగ్జిన్ కే మొగ్గు చూపారు.
Also Read: నేటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ..!
ఇదిలా ఉంటే తాజాగా కోవిషీల్డ్ బెటర్ అని ఓ అధ్యయనం అంటోంది. కోవిషీల్డ్ తీసుకున్న వారికే రోగనిరోధక శక్తి ఎక్కువగా వచ్చిందని సదరు సంస్థ చెబుతున్నది. 515 మందిలో కొవాగ్జిన్, కోవిషీల్డ్ ఎలా పనిచేస్తుంది? రోగనిరోధకశక్తి ఏ మేరకు అభివృద్ధి చెందింది? అనే అంశం మీద ఓ సంస్థ పరిశోధన జరిపింది.
కోవిషీల్డ్ తీసుకున్న వారిలో 98.1 శాతం యాంటిబాడీస్ వస్తుండగా.. కోవాగ్జిన్ తీసుకున్న వారిలో కేవలం 80 శాతం మాత్రమే యాంటీ బాడీస్ అభివృద్ధి చెందాయి. దీంతో కోవాగ్జిన్ కంటే కోవిషీల్డ్ ప్రభావంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే కోవాగ్జిన్ కూడా బాగానే పనిచేస్తున్నప్పటికీ.. కోవిషీల్డ్తో పోల్చి చేస్తే.. కొంత తక్కువ ప్రభావం చూపుతుందని వారు అంటున్నారు. అయితే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అందుబాటులో ఏ వ్యాక్సిన్ ఉంటే అది తీసుకోవడం బెటర్ అని శాస్త్రవేత్త ఏకే సింగ్ అంటున్నారు.